ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt: టూవీలర్లకు రెండు హెల్మెట్లు తప్పనిసరి

ABN, Publish Date - Jun 29 , 2025 | 04:30 AM

ద్విచక్రవాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

  • కొనుగోలు సమయంలోనే వాటిని వాహన తయారీదారులు అందించాలి

  • కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన

న్యూఢిల్లీ, జూన్‌ 28: ద్విచక్రవాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్‌ వాహనాల రూల్స్‌-1989కు పలు ముఖ్యమైన మార్పులను ప్రతిపాదించింది. కొత్త సవరణ నియమాల తుది నోటిఫికేషన్‌ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్‌ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వ నోటిఫికేషన్‌ పేర్కొంది. వాహనం నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారి భద్రత కోసం కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు తెలిపింది. హెల్మెట్‌ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది. 2026, జనవరి 1 నుంచి 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటే మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్‌2 క్యాటగిరీ ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ(ఏబీఎ్‌స)లను అమర్చాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా వాహనానికి ఆకస్మికంగా బ్రేక్‌ వేసిన సమయంలో మెరుగైన నియంత్రణ కల్పించడంతో పాటు జారిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.

Updated Date - Jun 29 , 2025 | 04:33 AM