ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు 1.50 లక్షల వరకూ ఉచిత వైద్యం

ABN, Publish Date - May 07 , 2025 | 05:48 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత వైద్యం అందించే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది

న్యూఢిల్లీ, మే 6: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత ఉచిత చికిత్సను అందించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని పేర్కొంది. ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. నిర్దేశిత ప్రమాణాలు కలిగి, నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. పోలీసులు, ఆసుపత్రులు, స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీల సహకారంతో ‘రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025’ను జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) అమలు చేస్తుంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.


పథకం అమలు, ఆసుపత్రులను పథకంలో చేర్చడం, బాధితులకు చికిత్స, ఆసుపత్రులకు చెల్లింపులు తదితర అన్ని విషయాలను ఎన్‌హెచ్‌ఏతో సమన్వయం చేసుకొనే బాధ్యత ఈ నోడల్‌ ఏజెన్సీదే. పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Updated Date - May 07 , 2025 | 05:48 AM