ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO Chairman: డిసెంబరులో గగన్‌యాన్‌

ABN, Publish Date - Jul 14 , 2025 | 04:43 AM

మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా వచ్చే డిసెంబరులో మానవరహిత రాకెట్‌ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ప్రకటించారు.

  • మానవరహిత రాకెట్‌ ప్రయోగం : ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌

చెన్నై, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా వచ్చే డిసెంబరులో మానవరహిత రాకెట్‌ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ప్రకటించారు. తమిళనాడులోని కన్నియాకుమారి జిల్లా కులశేఖర పట్టణంలో యువ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా నారాయణన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘గగన్‌యాన్‌’ మిషన్‌ ద్వారా ఒక భారతీయుడిని ఏవోజీ పద్ధతి ప్రకారం రాకెట్‌లో అంతరిక్షానికి పంపి.. అక్కడ పరిశోధనల అనంతరం మళ్లీ భూమి మీదకు తీసుకురానున్నామని చెప్పారు. వచ్చే డిసెంబరులో మానవ రహిత రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపుతామని, ఆ తర్వాత మరో రెండు రాకెట్లను పంపి పరిశోధనలు పూర్తి చేశాక.. 2027లో అంతరిక్షంలోకి మనిషిని పంపే గగన్‌యాన్‌ మిషన్‌ను చేపడతామని నారాయణన్‌ తెలిపారు. 2040లో చంద్రుడిపై భారతీయులు అడుగుపెట్టేలా మిషన్‌ను రూపొందించే ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 04:43 AM