Home » ISRO
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. ఇస్రో తయారు చేసిన ‘రీయూజబుల్ లాంచ్ వెహికల్’ ప్రయోగం నేడు మంచి సక్సెస్ సాధించింది. నేటి (శుక్రవారం) ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. గాల్లోకి ఎగిరిన అనంతరం ఈ రాకెట్ సురక్షితంగా రన్వేపై ల్యాండ్ అయింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
అంతరిక్షంలో భారత్ తొలి స్పేస్ స్టేషన్ను రానున్న కొన్నేళ్లలో అందుబాటులోకి రానుందని ఇస్రో(ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. రాబోయే రోజుల్లో స్టేషన్లోని మొదటి మాడ్యూల్స్ను ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
తమిళనాడులోని తూత్కుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. అయితే, అనూహ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన 'ఇస్రో' యాడ్ తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు డీఎంకేను తప్పుపట్టగా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి డీఎంకేను సమర్ధించారు.
మన భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చెప్పారు. అలాగే.. భారత వ్యోమగామి మన సొంత రాకెట్లోనే చంద్రుని ఉపరితలంపై దిగుతారని నమ్మకం వెలిబుచ్చారు.
అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. వాతావరణ పరిశోధనకు దోహదపడే ‘ఇన్సాట్-3 డీఎస్’ అధునాతన ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారని తెలిపారు.
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక, విక్రమ్ కు లేజర్ కిరణాలను పంపింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్1 తుది కక్ష్యలోకి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ట్వీట్ చేసి తెలిపారు.
నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభమన్నారు. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణిత కక్షలోకి ఎక్స్పోశాట్ చేరుకుందన్నారు.
చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రతిష్ఠాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించి 2023 ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాదిని అదిరిపోయే విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది.