Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు
ABN, Publish Date - Feb 04 , 2025 | 07:35 PM
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ స్పష్టం కానుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: మరికొన్ని గంటల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో.. అంటే ఫిబ్రవరి 5వ తేదీ.. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది.
మొత్తం 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది ఫిబ్రవరి 8వ తేదీ.. శనివారం తెలిపోనుంది. ఇక ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. వాటి వివరాలు..
Also Read: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఢిల్లీ సీఎంపై ఎఫ్ఐఆర్.. అసలు విషయం ఏమిటంటే..?
1)
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం:
అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)
పర్వేష్ వర్మ (బీజేపీ)
సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్ పార్టీ)
2)
కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం:
సీఎం అతిషి (ఆప్)
అల్కా లంభా ( కాంగ్రెస్)
రమేష్ బిధూరీ (బీజేపీ)
Also Read: కర్నూలులో బెంచ్ ఏర్పాటు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
3)
జంగ్పురా అసెంబ్లీ నియోజకవర్గం:
మనీష్ సిసోడియా (ఆప్)
సర్దార్ తర్విందర్ సింగ్ మర్హ(బీజేపీ)
ఫర్హాద్ సూరి (కాంగ్రెస్)
4)
మాలవ్యా నగర్ నియోజకవర్గం:
సోమనాథ్ భారతీ (ఆప్)
సతీష్ ఉపాధ్యాయ( బీజేపీ)
జితేందర్ కుమార్ కోచర్ (కాంగ్రెస్ పార్టీ)
Also Read: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన
5)
ఛత్తార్పూర్ నియోజకవర్గం:
బ్రహ్మ సింగ్ తన్వార్ (ఆప్)
ఖర్తార్ సింగ్ తన్వార్ (బీజేపీ)
రాజేందర్ సింగ్ తన్వార్ (కాంగ్రెస్)
6)
ప్రతాప్గంజ్ నియోజకవర్గం:
అవధ్ ఓజా (ఆప్)
రవీందర్ సింగ్ నేగీ( బీజేపీ)
అనిల్ చౌదరి ( కాంగ్రెస్)
Also Read: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ
7)
బల్లిమరాన్ అసెంబ్లీ నియోజకవర్గం:
ఇమ్రాన్ హుస్సేన్ (ఆప్)
హరూన్ యూసఫ్ (కాంగ్రెస్ పార్టీ)
కమల్ బగ్రీ (బీజేపీ)
8)
ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గం:
అమనతుల్లా ఖాన్ (ఆప్)
బ్రహ్మం సింగ్ (బీజేపీ)
అరిబ్ ఖాన్( కాంగ్రెస్)
Also Read: దివాన్ చెరువు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం
9)
షాకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గం:
సత్యందర్ జైన్ (ఆప్)
కరైన్ సింగ్(బీజేపీ)
సతీష్ లూథ్రా (కాంగ్రెస్ పార్టీ)
10)
రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం:
ప్రదీప్ మిట్టల్ (ఆప్)
సుమేష్ గుప్తా (కాంగ్రెస్ పార్టీ)
విజేందర్ గుప్తా (బీజేపీ )
ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకోనేందుకు మొత్తం 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో భద్రత కోసం 220 కంపెనీల పారా మిలటరీ దళాలు, 19 వేల మంది హోం గార్డులు, దాదాపు 40 వేల మంది ఢిల్లీ పోలీసులను వినియోగిస్తున్నారు.
For National News And Telugu News
Updated Date - Feb 04 , 2025 | 07:40 PM