LOC Infiltration Alert: నియంత్రణ రేఖ వెంబడి 42 లాంచ్ ప్యాడ్స్
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:10 AM
నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన 200 మంది ఉగ్రవాదులు భారత సరిహద్దు దాటేందుకు సన్నద్ధంగా ఉన్నారు
సరిహద్దు దాటేందుకు 200 మంది ఉగ్రవాదులు సిద్ధం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయని నిఘావర్గాల సమాచారం. ఇక్కడ శిక్షణ పొందిన 200మంది ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. సరిహద్దు దాటించేందుకు పాకిస్థాన్ సైన్యం వీరికి సహకరిస్తోంది. శిక్షణ పొందుతున్న ఉగ్రవాదుల్లో 115 మంది పాక్ జాతీయులున్నట్లు సమాచారం. వీరుకాక జమ్మూకశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్, జైష్ ఎ మహ్మద్, లష్కర్ ఎ తైబా తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 60 మంది విదేశీ ఉగ్రవాదులు ఇప్పటికే చురుగ్గా ఉన్నారని నిఘావర్గాలు గుర్తించాయి. 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా చురుగ్గా ఉన్నారని తెలిపాయి.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్
Updated Date - Apr 25 , 2025 | 03:10 AM