Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది మృతి
ABN, Publish Date - Jun 12 , 2025 | 03:38 PM
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు.
గాంధీనగర్, జూన్ 12: అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగిస్, ఒకరు కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించారు.
50 మృతదేహాలు..
మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు.
మాజీ సీఎం విజయ్ రూపానీ..
ఇంకోవైపు ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారు. ఆయన కుమార్తె లండన్లో నివసిస్తుంది. ఈ నేపథ్యలంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఇక ఆయన భార్య అంజలి రూపానీ లండన్లో ఉన్నారు. ఆమెను తీసుకు వచ్చేందుకు ఆయన లండన్ పయనమైనట్లు విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు వివరించారు.
230 మందిప్రయాణికులు, 12 మంది సిబ్బంది..
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వీరంతా ఈ ప్రమాదంలో మరణించారు.
ప్రయాణికుల వివరాలు ఇవిగో..
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణీకుల సమాచారం కోసం హెల్ప్లైన్ నెంబర్ ఇదే..
For National News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 04:55 PM