ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Travel Tips: రైళ్లలో లగేజీకి కూడా రూల్స్ ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:25 PM

రైళ్లలో ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చనే దానిపై భారతీయ రైల్వేలు కఠినమైన నియమాలను విధించాయి. పరిమితిని మించి లగేజీ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Luggage

ఇంటర్నెట్ డెస్క్‌: భారతదేశంలో రోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అందులో చాలా మంది తమతో పాటు బ్యాగులు, ఇతర పెద్ద పెద్ద సామన్లు తీసుకెళ్తుంటారు. కానీ, భారతీయ రైల్వేలు ప్రజలకు సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. అందులో లగేజీకి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు. అయితే, ట్రైన్‌లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు? పరిమితి మంచి లగేజీ తీసుకెళ్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు?

ప్రతి ప్రయాణికుడు టికెట్ తీసుకున్న తరహా (క్లాస్)ను బట్టి నిర్ణీత బరువులోపల లగేజీ తీసుకెళ్లవచ్చు. ఉదాహరణకు:

స్లీపర్ క్లాస్‌కి: సుమారు 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు

AC కోచ్‌లకు: 50-70 కిలోల వరకు

సాధారణ క్లాస్‌కి: 35 కిలోల వరకు

మీరు ఈ పరిమితిని మించిన బరువు తీసుకెళ్తే అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది.

ఎక్కడ తనిఖీ చేస్తారు?

మీరు స్టేషన్‌కు వచ్చిన తర్వాత, రైల్వే స్టేషన్‌లోని లగేజీ చెక్ పాయింట్లు లేదా తప్పనిసరిగా చెక్ చేసే చోట్ల మీ సామానును తనిఖీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో TTEలు లేదా ఇతర రైల్వే అధికారులు ట్రైన్‌లోనూ లగేజీ తనిఖీ చేయవచ్చు.

పరిమితి మించి లగేజీ తీసుకెళ్తే ఏం జరుగుతుంది?

  • మీరు నిర్ణీత పరిమితిని మించి సామాను తీసుకెళ్తే అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  • ఫీజు చెల్లించకపోతే జరిమానా విధించవచ్చు

  • కొన్ని సందర్భాల్లో మీ లగేజీని రైల్వే తీసేసే అవకాశం కూడా ఉంటుంది

ఏమి చేయాలి?

  • మీ సామానును ముందుగానే తూకం వేయించండి

  • మించి ఉన్న బరువుకి లగేజీ టికెట్ తీసుకోండి

  • ట్రైన్ ఎక్కే ముందు లగేజీ నిబంధనలను తెలుసుకోండి.

ముఖ్య గమనిక:

రైలులో కొన్ని వస్తువులు నిషేధించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి పేలుడు పదార్థాలు, మండే గుణం కలిగిన వస్తువులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, చనిపోయిన జంతువులు, 100 సెంటీమీటర్ల కంటే పెద్ద పెట్టెలు, 4 అంగుళాల కంటే ఎక్కువ పొడవున్న బ్లేడున్న కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాలు.అధిక పరిమాణంలో ఆహారం( ఎక్కువ పరిమాణంలో నెయ్యి, మాంసం వంటివి అనుమతించబడవు) ఇవి రైలులో ప్రయాణానికి సురక్షితం కాదు.

Also Read:

యూపీఐ కొత్త రూల్స్.. నేటి నుంచి అమలులోకి!

రోజంతా బూట్లు ధరిస్తున్నారా? జాగ్రత్త.!

For More Lifestyle News

Updated Date - Aug 01 , 2025 | 12:48 PM