Balochistan Attack: పాక్ ఆర్మీ వాహనంపై దాడి ఏడుగురి మృతి
ABN, Publish Date - May 07 , 2025 | 05:44 AM
బలూచిస్థాన్లో ఉగ్రవాద దాడిలో 7 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. బీఎల్ఏ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది
ఇస్లామాబాద్, మే 6: బలూచిస్థాన్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఏడుగురు పాకిస్థానీ సైనికులు మరణించారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది. కచ్చి జిల్లాలోని మాచ్ ప్రాంతంలో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. ఐఈడీతో వాహనాన్ని పేల్చారని పాకిస్థాన్ సైన్యం తెలిపింది.
Updated Date - May 07 , 2025 | 05:44 AM