Chennai News: తరగతి గది ముందు క్షుద్ర పూజలు..
ABN, Publish Date - Dec 24 , 2025 | 12:50 PM
పాఠశాలలో క్షుద్రపూజలు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా.. సమాచారమందుకున్న పోలీసులు పాఠశాలను సందర్శించి విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు
చెన్నై: ప్రధానోపాధ్యాయుడి గది ముందు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. సేలం జల్లా కామాండపట్టి ప్రభుత్వ పాఠశాలకు సోమవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు చేరుకున్న సమయంలో, హెచ్ఎం గది(HM Room) ముందు బొగ్గుతో ఒక వృత్తం గీసి, మధ్యలో చిన్న బొమ్మ ఉంచి, దాని చుట్టూ గుడ్లు, పసుపు, కుంకుమ, పూలను గమనించి దిగ్బ్రాంతి చెందారు.
అలాగే, గతి తలుపుకు పూల మాల వేసి ఉంది. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు జాన్ బోస్కోకెనడీ, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సంఘ నిర్వాహకులకు సమాచారం అందించాడు. అలాగే, ఈ వ్యవహారంపై ఒమలూరు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ముగ్గును సిబ్బంది తొలగించచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 24 , 2025 | 12:50 PM