Chennai: కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి
ABN, Publish Date - May 24 , 2025 | 12:57 PM
కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలు మృతిచెందిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. మేట్టుపాళయం - ఊటీ రహదారిలో కల్లార్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ మనవరాలు దివ్య ప్రియ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.
చెన్నై: కోయంబత్తూరు సమీపం మేట్టుపాళయం - ఊటీ రహదారిలో కల్లార్ ఫ్లైఓవర్ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ మనవరాలు మృతి చెందగా మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మదురైలో నివసిస్తున్న శ్రీనివాసన్ మనవరాలు దివ్య ప్రియ (28) మదురైలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. ఆమె భర్త కార్తీక్రాజా, బంధువులు వలర్మతి (48), పరమేశ్వరి (44) సహా బంధువులతో ఊటీకి ఈ నెల 20న కారులో విహారయాత్రకు బయలుదేరారు. ఊటీ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అందరూ గురువారం సాయంత్రం మదురై బయలుదేరారు.
మదురైకి చెందిన పార్తీబన్ నడుపుతున్న కారు మేట్టు పాళయం - కున్నూరు ఘాట్రోడ్డు కల్లారు సమీంపంలోని మలుపువద్ద బ్రేకులు పనిచేయకపోవడంతో అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. అదుపుతప్పిన ఆ కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దివ్యప్రియా, పరమేశ్వరి, వలర్మతిని స్థానికుల సహాయంతో కార్తీక్రాజా, డ్రైవర్ పార్తీబన్ కారు శిథిలాల మధ్య నుండి వెలికి తీసి ఆంబులెన్స్ను రప్పించి చికిత్స కోసం మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి దివ్యప్రియా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మేట్టుపాళయం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!
Read Latest Telangana News and National News
Updated Date - May 24 , 2025 | 12:57 PM