Chennai News: బిస్కెట్ల రూపంలో గంజాయి తరలింపు..
ABN, Publish Date - Nov 15 , 2025 | 12:11 PM
గంజాయిని బిస్కెట్ల రూపంలోకి మార్చి పోలీసు కళ్లుగప్పి విక్రయాలు చేపడుతున్న 42యేళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ఎస్టేట్ సమీపంలో తనిఖీలు చేస్తు న్న పోలీసులు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను ఆపి ఆమె బ్యాగు తనిఖీ చేశారు.
- మహిళ అరెస్ట్
చెన్నై: గంజాయిని బిస్కెట్ల రూపంలోకి మార్చి పోలీసు కళ్లుగప్పి విక్రయాలు చేపడుతున్న 42యేళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా.. తిరువళ్లూరు(Tiruvallur) జిల్లా అంబత్తూరు ఎస్టేట్ సమీపంలో తనిఖీలు చేస్తు న్న పోలీసులు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను ఆపి ఆమె బ్యాగు తనిఖీ చేశారు. అందులో బిస్కెట్ల రూపంలోకి మార్చిన గంజాయి గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఆమెను మహిళా పోలీస్ స్టేషన్(Police station)కు తరలించారు.
విచారణలో పట్టుబడిన మహిళ తిరువళ్లూరు జిల్లా అత్తిపట్టు ప్రాంతానికి చెందిన శుశాంత్కుమార్ భార్య గీత(Geetha)గా గుర్తించారు. ఈమె ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుండి గంజాయిని బిస్కెట్ల రూపంలో తరలించి యువతకు విక్రయించడానికి యత్నించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం ఆమెదగ్గరున్న 2.2 కేజీల గంజాయి బిస్కెట్లు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, అనంతరం కోర్టులో హాజరు పరిచి ఆమెను రిమాండ్కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News
Updated Date - Nov 15 , 2025 | 12:12 PM