Minister Anita : ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:13 AM
ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హోంశాఖ మంత్రి...
టీఎన్యూఎస్ కేలండర్ ఆవిష్కరణలో హోం మంత్రి అనిత
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. టీఎన్యూఎ్స 2025 కేలండర్, డైరీని ఆదివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఉపాధ్యాయ నియామకాలు, ఉపాధ్యాయ వర్గానికి పెద్దఎత్తున మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనేనన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు, కార్యదర్శి కొత్తగొర్ల వెంకట్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2025 | 04:13 AM