ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court : పెద్దిరెడ్డి అటవీ భూములపై చట్ట నిబంధనలు పాటించండి

ABN, First Publish Date - 2025-02-15T04:28:47+05:30

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయ న కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయ న కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తే చట్ట నిబంధనలు అనుసరించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో 2 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, పులిచర్ల తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. ఈ మేర కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. చిత్తూరుజిల్లా, పులిచర్ల మండలం, మంగళంపేట గ్రామ పరిధిలోని వివిధ సర్వేనెంబర్లలో ఉన్న సుమారు 75.74 ఎకరాల భూమి పెద్దిరెడ్డి కుటుంబం అధీనంలో ఉంది. అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Updated Date - 2025-02-15T04:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising