ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Judge: పెండింగ్‌ కేసులు త్వరగా పూర్తిచేయాలి

ABN, Publish Date - Mar 23 , 2025 | 01:17 AM

కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్‌ రెడ్డి కోరారు.

హైకోర్టు జడ్జితో ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయమూర్తులు

చిత్తూరు లీగల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్‌ రెడ్డి కోరారు. శనివారం చిత్తూరులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరుజిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు కేసుల విషయమై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి న్యాయమూర్తి చట్టాలపై అవగాహన పెంచుకుని కేసులను త్వరగా పూర్తిచేసేలా తమవంతు పాత్ర పోషించాలన్నారు. కేసులు పెండింగ్‌లో ఉంటే కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం కేసుల పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావుతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:17 AM