Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 02 , 2025 | 05:44 PM
Chandrababu Naidu: వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఉగ్రవాదులను అణిచివేయటం కోసం ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. గతంలో మోదీ గారెని ఎప్పుడు కలిసినా.. చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ, మొన్న అమరావతి కార్యక్రమానికి పిలవడానికి వెళ్లాను.
ఆ మీటింగ్ చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం.. ‘ నా దేశ ప్రజలు ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు’ అన్న ఆవేదన మోదీ గారిలో చూశాను. ఈ సందర్భంగా మీ అందరి తరపునా ఆయనకు నేనో విజ్ణప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మేము అండగా ఉంటాం’ స్పష్టం చేశారు. అనంతరం హిందీ భాషలో స్పందిస్తూ.. ‘ మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై.. ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ ఆప్ కే సాత్ హై.. పూరా దేశ్ ఆప్ కే సాత్ హై’ అని అన్నారు.
సభికులతో వందేమాతరం అని నినాదాలు ఇప్పించి మోదీకి మద్దతు తెలిపారు. వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. సభకు తరలివచ్చిన ప్రజలు జాతీయ జెండాలు ప్రదర్శించి మోదీకి మద్దతు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Updated Date - May 02 , 2025 | 05:56 PM