ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP CM Ramesh : వైసీపీ హయాంలో 30 వేల కోట్ల లిక్కర్‌ స్కాం

ABN, First Publish Date - 2025-02-12T06:02:37+05:30

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రూ.30 వేల కోట్ల లిక్కర్‌ స్కాం జరిగింది.

  • ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా 10 రెట్లు పెద్దది: ఎంపీ సీఎం రమేశ్‌

న్యూడిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రూ.30 వేల కోట్ల లిక్కర్‌ స్కాం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం రూ.2,500 కోట్లు కంటే పది రెట్లు పెద్ద స్కాం అది’ అని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపించారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ‘2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం పాలసీని మార్చింది. మద్యం దుకాణాలను ప్రైవేటు నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చింది. రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడింది. మద్యం దుకాణాల్లో ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగాయి. ఒక్క పేమెంట్‌ కూడా డిజిటల్‌ రూపంలో తీసుకోలేదు. మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగులను నియమించారు’ అని రమేశ్‌ ఆరోపించారు. ఈక్రమంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘సీఎం రమేశ్‌ బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. మార్గదర్శి స్కాంపై మాట్లాడినందుకు ప్రతీకారంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని అన్నారు.

Updated Date - 2025-02-12T06:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising