Home » Rajya Sabha
బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణలో కాంగ్రెస్ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.
రాజ్యసభకు ఈనెల 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా దీనికి ముందే పోటీ లేకుండా 24 మంది పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు.
మధ్యప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు రజనీశ్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్కు అవకాశం కల్పించింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా.. అది తిరస్కరణకు గురైంది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10:50 గంటల నుంచి 11:50 గంటల వరకు నామినేషన్ కార్యక్రమం జరిగింది.
జార్ఖాండ్ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ విషయంలో జేఎంఎం, కాంగ్రెస్ మధ్య ఏర్పడిన విభేదాలకు తెరపడింది. చెరో స్థానంలో పోటీ చేసేందుకు రెండు భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. రమేశ్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు.