Home » Rajya Sabha
పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.
రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.
రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.
రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ అయ్యారు. ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. నారాయణ మూర్తికి రూ.10 వేలు ఇవ్వడంతో ఆయన ఇన్పోసిస్ కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుధామూర్తి రచయిత. మహిళా దినోత్సవం రోజున సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో(Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల డేటాను విశ్లేషించిన ఏడీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602గా ఉన్నాయని తెలిపింది.
రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన హవా చాటుకుంది. పెద్దలసభలో మెజారిటీ మార్క్కు అత్యంత చేరువలోకి వచ్చింది. మంగళవారంనాడు జరిగిన 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు కైవసం చేసుకుని పైచేయి సాధించింది. వీటిలో పోటీ లేకుండానే గెలిచిన 20 సీట్లు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల సంఖ్య 97కు చేరింది.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక లో కాంగ్రెస్కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జి.పాటిల్ మంగళవారంనాడు ధ్రువీకరించారు.
కర్ణాటక నుంచి రాజ్యసభకు మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుకుంది. 3 రాజ్యసభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. బీజేపీ ఒక స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, జీసీ చంద్రశేఖర్ సైయద్ నసీస్ హుస్సేన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి నారాయణ భడంగే గెలుపొందారు.