Home » Rajya Sabha
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.
బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ కేవలం 35 సీట్లు సాధించింది.
జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
నాలుగు రాజ్యసభ సీట్లలో మొదటి రెండింట్లో ఒక స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ ఆశించినప్పటికీ రాజ్యసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల పేర్లను నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే ప్రకటించింది.
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ (లెజిస్లేచర్తో సహా), లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని, రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏర్పడిన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఎలక్టరేట్లు లేరని ఈసీ తెలిపింది.
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని 'ఇండియా' కూటమి భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు మార్గం సుగమం అయింది. ఇవాళ రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ..
పహల్గాం ముష్కరులు ఎక్కడ కనిపించినా తలలోంచి బుల్లెట్లు దింపాలని దేశంలోని అనేక మంది నుంచి తనకు మెసేజ్లు వచ్చాయని, యాదృచ్ఛికంగా ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల తలల్లోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు.
ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టంతో ఆయన తమ కార్యాలయంలో (పీఎంఓ) ఉన్నారని సభకు అమిత్షా తెలియజేశారు. విపక్షాలు కోరినంత వరకూ చర్చ జరిపే విషయంపై నిర్ణయం తీసుకునేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ అని, కానీ ఎవరు సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అని అమిత్షా చెప్పారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై పెద్దల సభలో రెండో రోజు జరుగుతున్న చర్చలో జయా బచ్చన్ మాట్లాడారు. పహల్గాంలోని బైసరాన్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.