Home » Rajya Sabha
పశ్చిమాసియాలో పరిణామాలు, భారత్పై దాని ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలుగుతోందని చెప్పారు.
రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా ఆయన తనకు తెలుసునని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు.
రాజ్యసభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పత్రాలు పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సాయి అనే వ్యక్తి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఏప్రిల్లో ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్టు స్వయంగా వెల్లడించారు.
మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' అభ్యర్థిగా శరద్ పవార్ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని, నితీశ్ తనయుడు నిషాంత్ కుమార్ బిహార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది.
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనాతా పార్టీ 9 మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బిహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్ ఉంటుంది.