ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీపై మనసులో మాట బయటపెట్టిన రేణుకా చౌదరి

ABN, Publish Date - Apr 22 , 2024 | 04:58 PM

Telangana: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సై అంటున్నారు. తనను ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయమంటే రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్‌సభకు పోటీ చేయమంటే చేస్తానని రేణుక తన మనసులో మాట బయటపెట్టారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ప్రధాని మోదీ, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Rajyasabha MP Renuka Chaudary

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి (Rajyasabha MP Renuka Chowdary) సై అంటున్నారు. తనను ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయమంటే రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్‌సభకు పోటీ చేయమంటే చేస్తానని రేణుక తన మనసులో మాట బయటపెట్టారు. సోమవారం గాంధీభవన్‌లో (Gandhi Bhavan) మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ప్రధాని మోదీ, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వడదెబ్బ తాకిందేమో అని వెళ్లి రెస్ట్ తీసుకోవాలని సెటైర్ విసిరారు. కేసీఆర్‌కు డోస్ ఎక్కువైందేమో.. ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మంను పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని తేల్చిచెప్పారు.


నా మంగళ సూత్రం తీసే దమ్ము ఉందా?

‘‘నాకు ఎవరూ చట్టం కాదు, ఎవరూ గొట్టం కాదు. మోదీ గ్యారంటీలకు వారెంటీ అయిపోయింది. మోదీకి ఓటమి భయం పట్టుకుంది. నా మంగళ సూత్రం తీసే దమ్ము ఎవడికీ లేదు. మోదీ హిందువులను ద్వేశిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేస్తారో ఎన్నికల కమిషన్ చెప్పాలి. మోదీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడడానికి ఎదురు చూస్తున్నా. దేశ మహిళలను మోదీ అవమానపరిచాడు. మోదీ తన స్నేహితుల అప్పులన్నీ మాఫీ చేశాడు. మోదీకి రాజ్యాంగం గురించి, దేశ చరిత్ర గురించి ఏ మాత్రం తెలియదు. మోదీ విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తున్నాడు. హిందూ మహిళల మాంగల్యాలను ముస్లింలు తీసుకెళ్తారని రెచ్చగొడుతున్నాడు. దేశ ప్రధాని ఇంత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. మోదీ కట్టిన తాళి తన భార్యకి ఉరితాడుగా మారిందిః. దేశంలోని ముస్లింలను అవమానపరచడానికి మోదీకి ఎంత దమ్ము? మనల్ని కాపాడిన ముస్లింలు ఉన్నారు. మాతో కలిసి పెరిగిన ముస్లింలు ఉన్నారు. మంగళ సూత్రాలు ఇచ్చినా తీసుకునే ముస్లింలు ఎవరూ లేరు. టెర్రరిజం, విద్వేషం కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. అన్ని మతాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.. పంద్రాగస్టులోపే రుణమాఫీ


మోదీ రావణాసురుడు

ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ పండుగ రోజున రాఖీ కడతానని రేణుకా చౌదరి అన్నారు. ‘‘నేను శూర్పణక అయితే, నా బ్రదర్ మోదీ రావణాసురుడు. నా బ్రదర్‌ను పార్లమెంట్‌లో కలవడానికి ఎదురుచూస్తున్నా’’ అంటూ తనదైలి శైలిలో రాజ్యసభ ఎంపీ సెటైర్లు విసిరారు.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Elections 2024: ఖాతా తెరిచిన బీజేపీ.. ఎన్నికలు అవ్వకుండానే అభ్యర్థి గెలుపు.. అదెలాగంటే?

Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 05:03 PM

Advertising
Advertising