Share News

Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:39 PM

Andhrapradesh: ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...

Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ
TDP MLC Ashok Babu

అమరావతి, ఏప్రిల్ 22: ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు (YSRCP Leaders) తుంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు (TDP MLC Ashok Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నామినేషన్ సమయంలో ఆయన తరపున సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) 100 మీటర్ల ముందే ఆగి కారు దిగి నామినేషన్ వేశారని గుర్తుచేశారు.

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.. పంద్రాగస్టులోపే రుణమాఫీ


ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనపై స్పందించకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యి టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇకనైనా వైసీపీతో భుజాలు రాసుకోవడం ఆపి చట్ట ప్రకారం పనిచేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.. పంద్రాగస్టులోపే రుణమాఫీ

Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 04:59 PM