Home » Chandrababu
రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఆవిష్కృతమైన వేళ...ఉత్తరాంధ్రకు ఉత్సవ కళ వచ్చింది. నేల ఈనిందా... అన్నట్టు భోగాపురానికి జనం పోటెత్తారు.
‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
'మా రాజధాని అనే చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపినందుకు, నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను': సీఎం చంద్రబాబు
విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి సవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.