Home » Chandrababu
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎల్లుండి అమరావతికి వస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని పథకం ద్వారా ఏపీలో గ్రామీణ ఆరోగ్య సేవలు 'గేమ్ ఛేంజర్' కాబోతున్నాయని ఆయన తెలిపారు..
పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారి పనితీరుకు సంబంధించిన నివేదికలను సీల్డ్ కవర్లలో ఇస్తున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నివేదికల ద్వారా వారిని.. వారికే అద్దంలో చూపిస్తున్నామని, మారకపోతే వారికే నష్టమని హెచ్చరించారు..
రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. మంత్రివర్గ సమావేశానికి ముందు NDA నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు గుంటూరులోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేసి, ఆందోళనకారుల నుంచి రక్షణగా 'వజ్ర' వాహనంలో తరలించారు.
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.
దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందేందుకు అనువైన పథకాలతో బాధ్యతగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు.