Home » Bhuvaneswari
అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Andhrapradesh: ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...
నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా సమర్పించడం లేదు. చంద్రబాబు తరుఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 01:27గంటలకు రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.
అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మే 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తానని.. నిజం గెలవాలి కాకుండా మరో రూపంలో ప్రచారం చేస్తానని నారా భువనేశ్వరి వెల్లడించారు.
వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని విమర్శించారు. రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. కౌరవ సభను గౌరవ సభగా చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన శపథాన్ని గుర్తుచేశారు. అలా జరగాలంటే టీడీపీ, బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమగ్ర న్యాయం జరిగిందని టీడీపీ ( TDP ) లీడర్ పంచుమర్తి అనురాధ అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు రూ.2లక్షల కోట్లు అందిచారని వెల్లడించారు.
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర ముగిసింది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న 'నిజం గెలవాలి' ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8,500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.