Home » Nominations
ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని వినేశ్ ఫోగట్ తెలిపారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
రాష్ట్రీయ లోక్ మోర్చా నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ ను బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే నామినేట్ చేసింది. తనను బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరికి ఉపేంద్ర కుష్వాహ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
రాయబరేలి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి బయపడే ఆయన రాయబరేలి వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.