Home » TS News
Telangana: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని..
Andhrapradesh: ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.
ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
Telangana: ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అని.. ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందన్నారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.
Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.
Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్సీట్గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
Telangana: ‘నేను పార్టీ మారడం కేటీఆర్కు ఇష్టం లేదు. కవిత అరెస్ట్ అయిన మూడు రోజులకు కేటీఆర్ కూడా స్టేడియం వెళ్లి మ్యాచ్ చూసాడు’’ అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...అపాయింట్మెంట్ అడిగే లీడర్కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.