వైఎస్ 75 వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Jul 09 , 2024 | 01:34 PM
గుంటూరు జిల్లా: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వైఎస్ షర్మిల తండ్రి లాగే 2029 లో సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం..
తండ్రి ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ వేడుకల్లో ప్రసంగిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు శ్రీ వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేవీపీ తదితరులు..
దివంగత సీఎం వైఎస్ఆర్75 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పూల బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న షర్మిల. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్, రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కేవీపీ తదితరులు..
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటలో వేదికపై మాట్లాడుకుంటున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
Updated Date - Jul 09 , 2024 | 01:34 PM