Home » YSR Jayanthi
అవును.. వైఎస్ ఫ్యామిలీలో (YS Family) విభేదాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan Reddy).. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు బోలెడన్ని వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవన్నీ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవన్నీ అటుంచితే..
వైఎస్ జయంతి సందర్భంగా సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక పరిణామం చోటుచేసుకుంది. నేడు (జూలై 8, 2023, శనివారం) వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పరిణామంతో మొత్తానికో క్లారిటీ వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి (YSR Jayanthi) ఒక్కరోజు ముందే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జూలై-08న వైఎస్టార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని.. అధికారిక ప్రకటన ఉంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే...