Home » Mangalagiri
క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని.. వారి కంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం.. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూవలరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం మంగళగిరి కొండ చుట్టూ ¾ వంతు భాగంలో పాత, కొత్త హైవేలను కలిపే విధంగా వంద అడుగుల రోడ్డును 3.47 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఇది పానకాలస్వామి ఘాట్ రోడ్డుతో అనుసంధానమయ్యే విధంగా ఉంటుంది.
ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. తనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల నుంచే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులు నేచే బట్టలపై జీఎస్టీ ఐదుశాతం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
చేనేతల ఆదాయం 30శాతం పెరిగేలా అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. చేనేతలను ఆదుకుంటూనే స్వర్ణకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని లోకేష్ అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరిలో పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికారులకు మంత్రి నారా లోకేష్ వందరోజుల కార్యాచరణ రూపొదించారు.