ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: పిఠాపురంపై పవన్ ఫోకస్..

ABN, Publish Date - Mar 30 , 2024 | 06:57 AM

పిఠాపురంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. నేటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

కాకినాడ: పిఠాపురంపై జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫోకస్ చేశారు. నేటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర (varahi Yatra) పేరిట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12. 30 గంటలకు పవన్ హెలికాఫ్టర్‌లో రానున్నారు. మధ్యాహ్నం 1గంటకు పిఠాపురం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. 1.30కు దత్త పీఠాన్ని దర్శించుకోన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దొంతమూరులో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ తో భేటీ కానున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో తన బసకు పయనం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్‌లో వారాహి విజయభేరీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

అబద్ధాలతో ‘సిద్ధం’

పవన్ వారాహి విజయభేరి యాత్రపై పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్‌ (Nadendla Manohar) మాట్లాడుతూ... ‘తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రిల్‌ 12 వరకూ ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్‌ 2 వరకూ ఆయన పిఠాపురంలో ఉంటారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు పవన్‌ పిఠాపురం చేరుకుంటారు. తొలిరోజు శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దత్త పీఠాన్ని దర్శిస్తారు. దొంతమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో వారాహి విజయభేరి సభలో పాల్గొంటారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం (Ugadi Festival) సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు’ అని తెలిపారు.

చీపురుపల్లిలో బొత్స X కళా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 06:57 AM

Advertising
Advertising