Home » Nadendla Manohar
ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.
నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు మండలం కాపవరంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం విజయవాడ కారులో బయలుదేరుతూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించేశారు.
Andhrapradesh: సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్ను తీసుకొస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు.
Andhrapradesh: వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు.
Andhrapradesh: వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపి కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బెంగళూరు పర్యటనలో బిజీగా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడవుల పరిరక్షణలో భాగంగా సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు.
ఢిల్లీలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గురువారం నాడు కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినతి పత్రం అందజేశారు.
ఏపీ అభివృద్ధి కావాలంటే సమష్టిగా పని చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు.