Home » Nadendla Manohar
ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగంగా ఉన్న వేలాది ఎకరాల భూముల వేలం ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.
ఏపీ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతోమంది పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు.
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.
గ్రామాల్లో విలేజ్ మార్ట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.
పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తెనాలిలో మంత్రి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానం.. అరకొర సమాచారంతో మాట్లాడటం మానుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.
కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ ద్వారా సరఫరా చేసే బియ్యంలో 10 శాతం నూకల విధానానికి కేంద్రం అంగీకారం తెలిపింది.