ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!

ABN, Publish Date - Apr 11 , 2024 | 04:41 PM

Andhrapradesh: తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే లోకేష్ కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గురువారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యువనేత కోయంబత్తూరు పయనమయ్యారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే యువనేత అక్కడకు బయలుదేరి వెళ్లారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయనున్నారు.

TDP Leader Nara Lokesh

అమరావతి, ఏప్రిల్ 11: తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే లోకేష్ కోయంబత్తూరుకు (Coimbatore) బయలుదేరి వెళ్లారు. గురువారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యువనేత కోయంబత్తూరు పయనమయ్యారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి (BJP MP Candidate Annamalai Kuppuswamy) మద్దతుగా లోకేష్ ప్రచారం చేయనున్నారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా కోయంబత్తూరు సీటును ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు యువకులు, ఎన్డీయే పక్షాల నాయకులు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే లోకేష్‌ కూడా అన్నామలైకు మద్దతుగా నేడు, రేపు ప్రచారం నిర్వహించనున్నారు.

Viral: ఆపరేషన్ సందర్భంగా పాట ప్లే చేసిన డాక్టర్ .. ఎందుకో తెలిస్తే..


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాలకు చెందిన నాయకులతో ప్రచారం చేయించే వ్యూహంలో భాగంగా లోకేష్ తమిళనాడులో పర్యటించనున్నారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు తమిళనాడు ప్రాంతంలో ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో లోకేష్ పాల్గొననున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమై అన్నామలై విజయానికి సహకరించాలని టీడీపీ యువనేత కోరనున్నారు. అనంతరం కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరుగుపయనం కానున్నారు. ఆపై రేపు (శుక్రవారం) సాయంత్రం యథావిధిగా మంగళగిరి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలకు నారా లోకేష్ హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే...

YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 05:01 PM

Advertising
Advertising