Home » Tamilnadu News
తమిళనాడు CM విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ బంధువులకు, జెన్ జీ మిత్రులకు నా వణక్కమ్ అని ప్రసంగాన్ని ప్రారంభించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్పై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రతిపాదిస్తున్న 'డీలిమిటేషన్' ప్రక్రియపై సీఎం విజయ్ తమిళనాడు ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే ఏ పునర్విభజననైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని నాయకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమిళనాడు సర్కార్తో చర్చల్లేవని తేల్చి చెప్పారు.
తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్కు పెద్ద తలనొప్పిగా మారింది.
సీఎం విజయ్ సర్కారుకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మదురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.