Bhadrachalam : సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్ర
ABN, First Publish Date - 2025-04-03T15:03:11+05:30
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు.
భద్రాద్రి జిల్లా: భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు. బానుడి భగభగలను సైతం భక్తులు లెక్కచేయడం లేదు. భక్తుల పాదయాత్ర సందర్భంగా స్థానికులు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తుల ఆరోగ్యం కోసం దారిపోడవునా మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీన జరుగనున్న శ్రీరామనవమి వేడుకలకు ఒకరోజు ముందుగానే భక్తులు భద్రాచలం చేరుకోనున్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి...
Lokesh Mangalagiri Dvelopment: అందులో మంగళగిరిని టాప్లో ఉంచుతాం
Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి
TDP Nominated Posts: మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!
Read Latest AP News And Telugu News
Updated Date - 2025-04-03T15:05:58+05:30 IST