Fee Payment: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:20 AM
ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
1000 ఆలస్య రుసుముతో 22 చివరి తేదీ
ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రూ.1000 అపరాధ రుసుముతో కలిపి ఈ నెల 22 లోపు రెగ్యులర్/ప్రైవేటు విద్యార్థులు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే చివరిదని, ఇక మీదట పొడిగింపు ఉండదని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాలను 24లోపు ప్రధానోపాధ్యాయులు డీఈవో కార్యాలయాల్లో సమర్పించాలని, వాటిని 25 లోపు డీఈవోలు తమ కార్యాలయానికి పంపించాలని డైరెక్టర్ ఆదేశించారు.
Updated Date - Jan 09 , 2025 | 05:20 AM