Home » Schools
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రీ ప్రైమరీ విద్యా విధానంలో నవశకానికి నాంది పలికారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది 4,900 బడుల్లో యూకేజీ విద్యను అందించబోతున్నారు..
మొంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో గురువారం పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఫీజు బకాయిలపై తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాటకి సిద్ధమయ్యారు. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ చేపట్టడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో బుధవారం మంటలు చెలరేగాయి. నాదర్గుల్ బ్రాంచ్కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏసీ బస్సు లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్, ఫర్నిచర్ అందజేశారు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి. స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన..
మా స్కూల్లో తాగడానికి మంచి నీళ్లు లేవు. చేతులు, ప్లేట్లు కడుక్కునే నీటినే తాగుతున్నాం. కొన్ని నెలల నుంచి ఈ ఉప్పు నీరు తాగలేక ఇబ్బంది పడుతున్నాం. మీరైనా మాకు మంచి నీరు వచ్చేలా చూడండి. కానీ మా ఫొటోలను పేపర్లో వేయొద్దు..! మా మేడమ్ వాళ్లు.. సార్ వాళ్లు చూస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు..’’ ‘‘ఇంటి నుంచి.. హాస్టల్ నుం...
దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు..
దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక రాష్ట్రాల్లో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
బడికి వెళదామంటే కుక్కల భయం, దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూలు ఎదురుగా గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు రోడ్లపైనే కాపు కాస్తున్నాయి. బడికి వచ్చే విద్యార్థులను కరుస్తుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది.