5 డీఏలను జూన్ 2లోపు విడుదల చేయాలి
ABN, Publish Date - May 20 , 2025 | 05:31 AM
ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను జూన్ 2వ తేదీలోగా విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ కో-ఆర్టినేషన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి
బర్కత్పుర, మే 19 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను జూన్ 2వ తేదీలోగా విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ కో-ఆర్టినేషన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు అయిందని, వెంటనే పీఆర్సీని ప్రకటించాలని కోరింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు శ్రీనివా్సగౌడ్ తదితరులు మాట్లాడారు. పెన్షనర్లకు రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు క్యాష్లెస్ వైద్యం అందించాలని, హెల్త్కార్డులు వెంటనే జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. .
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 20 , 2025 | 05:31 AM