ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: తెలుగు రాష్ట్రాల జల విద్యుత్‌ వివాదం.. విచారణ ఆగస్టు 19కి వాయిదా

ABN, Publish Date - Jul 29 , 2025 | 03:55 AM

తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జల విద్యుత్‌ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 19కి వాయిదా వేసింది.

న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జల విద్యుత్‌ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 19కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అదే ఏడాది జూలై 14న ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

అలాగే, జల విద్యుత్‌ ఉత్పత్తిపై తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్‌ 7న ఆంధ్రప్రదేశ్‌ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ ధర్మాసనం సోమవారం విచారణ చేసింది. ఈ అంశంలో లోతైన వాదనలు అవసరమని పేర్కొంటూ, ఆగస్టు 19కి విచారణను వాయిదా వేసింది.

Updated Date - Jul 29 , 2025 | 03:55 AM