ఆరా మస్తాన్ వాంగ్మూలం నమోదు చేసిన సిట్
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:16 AM
సెఫాలజిస్టు ఆరా మస్తాన్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు బుధవారం నమోదు చేశారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డితో ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్ను
ఆయన రేవంత్, కొండల్రెడితో మాట్లాడిన కాల్స్ ట్యాపింగ్
వందల రికార్డింగ్లను ఆయనకు చూపిన సిట్
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సెఫాలజిస్టు ఆరా మస్తాన్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు బుధవారం నమోదు చేశారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డితో ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్ను ప్రభాకర్రావు ఆధ్వర్యంలోని టీం ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిందన్న విషయాన్ని మస్తాన్కు సిట్ అధికారులు ఆధారాలతో చూపించారు. 2023 నవంబరులో మస్తాన్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ను ట్యాపింగ్ చేసి సంభాషణలను ప్రభాకర్రావు బృందం రికార్డు చేసింది. తన ఫోన్ ట్యాపింగ్ డేటాను సిట్ అధికారులు చూపించడంతో మస్తాన్ విభ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. 2020 నుంచి మస్తాన్ ఫోన్ను ఎస్ఐబీ అధికారులు ట్యాపింగ్లో పెట్టారని, 2023లో మావోయిస్టుల సమాచారం కోసమంటూ ఆయన ఫోన్ నెంబర్ ట్యాపింగ్కు రివ్యూ కమిటీ అనుమతి తెచ్చుకున్నారని సమాచారం.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మస్తాన్ మాట్లాడిన, ఆయనకు వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారికి తన కాల్స్లో ఒకటో రెండు అవసరం అవ్వవచ్చని అందుకని తన భార్యాపిల్లలతో మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేయడం శోచనీయమని విచారణ తర్వాత మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటేనే భయపడే విధంగా కేంద్రం చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు తనకు చాలా డేటాతో పాటు రికార్డింగ్లు చూపించారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 05:16 AM