అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Mar 18 , 2025 | 12:18 AM
సమస్యలు పరిష్కరిం చాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో సోమ వారం అమరవీరుల స్తూపం వద్ద మహా ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
పెద్దపల్లి టౌన్, మార్చి 17 (ఆంఽధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరిం చాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో సోమ వారం అమరవీరుల స్తూపం వద్ద మహా ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బడ్జెట్లో రూ.18 వేల వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆన్ లైన్ పని భారం తగ్గించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వం సమ స్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోరాటాలను ఉధృ తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు బి వనజారాణి, జి జ్యోతి, సిహెచ్ సులోచన, రాజనర్సమ్మ, కే శోభ, శ్యామల, రామలక్ష్మి, ఆర్ స్వరూప, టి కృష్ణకుమారి, అమృత వినోద, సిఐటియు నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు, ఎస్ రవీందర్ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 12:18 AM