Vemula Kavitha: కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్
ABN, Publish Date - May 21 , 2025 | 04:04 AM
కాళేశ్వరం కమిషన్ నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కుట్రగా ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రిపోర్టు చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠకు హాని చేయడమే లక్ష్యమని అన్నారు.
రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని కవిత ఎద్దేవాచేశారు. ప్రజలకోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రేవంత్రెడ్డి సర్కార్ కుట్రచేస్తోందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ఎన్ని కమిషన్లువేసినా.. కాలక్రమంలో న్యాయాన్ని గెలిపిస్తాయని, నిజాలన్నీ బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం.. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న కుట్రపూరిత చర్య అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ఈ నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటిసులుగానే పరిగణిస్తామని తెలిపారు.
Updated Date - May 21 , 2025 | 04:05 AM