ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Farmhouse Case: ఫామ్‌హౌస్ కేసు.. పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వివరణ

ABN, Publish Date - Feb 17 , 2025 | 12:19 PM

Farmhouse Case: బీఆర్‌ఎస్ ఎమ్మెల్స పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కోడిపందాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చారు పోచంపల్లి.

Farmhouse Case

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో (Farmhouse Case) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (BRS MLC Pochampally Srinivas Reddy) పోలీసులకు వివరణ ఇచ్చారు. కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ ఎమ్మెల్సీది కావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, అలాగే ఫామ్‌హౌస్‌కు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో న్యాయవాదితో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ.. మొయినాబాద్ పోలీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. కోడి పందాలు ఆడించిన ఫామ్ హౌస్ తనదేనని 2023 వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజ్‌కు ఇచ్చినట్లు పోచంపల్లి పేర్కొన్నారు.


రమేష్ కుమార్‌తో పాటు మరొకరి కూడా లీజ్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. లీజ్ పత్రాలను కూడా పోలీసులకు అందజేశారు పోచంపల్లి. లీజ్‌కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కోడి పందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Students Protest: బాత్రూంలోకి తొంగిచూస్తున్నారు.. విద్యార్థినిల ఆందోళన


కాగా.. భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అదే ఫామ్‌హౌస్‌‌లో రెండు మూడు సార్లు పెద్దఎత్తన కోడిపందాలు, క్యాసినోలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో మరోసారి కోడిపందాలు నిర్వహించాడు గబ్బర్ సింగ్. సంక్రాంతి పండగ తర్వాత మిగిలిన కోళ్లను ఫామ్‌హౌస్‌కు తీసుకువచ్చి కోడిపందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది బిజినెస్‌మెన్స్‌, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కోడిపందాలకు హాజరయ్యారు. దీనిపై పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు. అయితే అప్పటికే పలువురు తప్పించుకోగా.. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు అంతా ఏపీ వాసులే. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో గేమింగ్ చట్టం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు అయ్యాయి.


అయితే ఈ ఫామ్‌హౌస్ యజమానిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఉండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీంతో నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ ఈరోజు తన న్యాయవాదితో కలిసి మొయినాబాద్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఈ కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఇచ్చిన వివరణపై పోలీసులు సంతృప్తి చెందుతారా లేక వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

హాస్టల్ బాత్రూంలో గుర్తుతెలియని వ్యక్తులు.. విద్యార్థినిల ఆందోళన

రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 12:25 PM