ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్య శ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌పై ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఫిర్యాదుల్లేవు

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:13 AM

పైసలిస్తేనే ఆరోగ్యశ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌కు అనుమతిస్తున్నట్లు ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి నుంచి తమకు ఫిర్యాదు రాలేదని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

  • పూర్తి పారదర్శకతతోనే అనుమతి

  • ‘‘ఆంధ్రజ్యోతి’’ కథనంపై సీఇవో వివరణ

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పైసలిస్తేనే ఆరోగ్యశ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌కు అనుమతిస్తున్నట్లు ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి నుంచి తమకు ఫిర్యాదు రాలేదని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకానికి ప్రైవేటు ఆస్పత్రుల ఎం-ప్యానల్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడుతున్నామన్నారు. ‘ఆరోగ్య శ్రీ అనుసంధానం-పైసలిస్తే పరిపూర్ణం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనంపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. 2023 డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 97 ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో ఎం-ప్యానెల్‌ చేశామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి నగదు రహిత వైద్యం మరింత మందికి అందుబాటులోకి తేవడానికి ‘ఆరోగ్య శ్రీ-ఎం-ప్యానెల్‌’ ఆస్పత్రుల సంఖ్యను పెంచడంతోపాటు కఠిన నిబంధనలనూ సరళతరం చేశామని వివరించారు. ఎం-ప్యానెల్‌మెంట్‌ అండ్‌ డిసిప్లినరీ కమిటీని తొలగించలేదని స్పష్టం చేసిన ఉదయ్‌ కుమార్‌.. ప్రైవేటు ఆస్పత్రుల ఎం-ప్యానెల్‌ విషయమై పూర్తిగా సమీక్షించి, సిఫారసులు చేయడంలో ఈడీసీ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ఎం-ప్యానెల్‌ పర్యవేక్షణ అధికారికి ఆ బాధ్యతలు అప్పగించి ఏడాది కూడా దాటలేదని ఆయన తెలిపారు.

Updated Date - Jul 03 , 2025 | 05:13 AM