ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shubham Shukla: అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..దీంతోపాటు..

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:23 PM

భారత్ అంతరిక్ష యాత్రలో మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla), యాక్సియం మిషన్-4 (Ax-4)లో భాగంగా జూన్ 25, 2025, బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (IST) అంతరిక్ష యాత్రకు విజయవంతంగా వెళ్లారు.

Shubham Shukla

భారత్ మరోసారి అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubham Shukla) యాక్సియం మిషన్-4 (Ax-4)లో భాగంగా బుధవారం (జూన్ 25, 2025) మధ్యాహ్నం 12:01 గంటలకు (IST) అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌పై కొత్త స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఈ మిషన్ ప్రారంభమైంది. ఈ చారిత్రక యాత్రలో శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు బయలు దేరారు.

రెండో మానవ అంతరిక్ష యాత్ర

ఈ మిషన్‌కు అమెరికా మాజీ నాసా వ్యోమగామి, యాక్సియం స్పేస్‌లో హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ డైరెక్టర్ అయిన పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు. శుభాంశు శుక్లా ఈ మిషన్‌లో పైలట్‌గా వ్యవహరిస్తుండగా, హంగరీకి చెందిన టిబోర్ కపు, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియేవ్స్కీ మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు. ఈ మిషన్ భారతదేశం, పోలాండ్, హంగరీలకు 40 సంవత్సరాల తర్వాత తమ రెండో మానవ అంతరిక్ష యాత్ర కాగా, ISSకు తొలి ప్రభుత్వ స్పాన్సర్డ్ మిషన్‌గా చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాకేష్ శర్మ తర్వాత

ఇది భారతదేశం స్వతంత్ర మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం కాగా, 1984లో రాకేష్ శర్మ తర్వాత శుభాంశు శుక్లా రెండో భారతీయ వ్యోమగామిగా ISSకు చేరుకున్నారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక అరుదైన ఘనతగా చెబుతున్నారు నిపుణులు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక గురువారం (జూన్ 26, 2025) ఉదయం 7:00 గంటలకు (EDT) / సాయంత్రం 4:30 గంటలకు (IST) ISS హార్మొనీ మాడ్యూల్‌లోని స్పేస్ ఫేసింగ్ పోర్ట్‌కు ఆటోమేటిక్‌గా డాక్ చేయనుంది.

ఇతర దేశాలు కూడా..

ఈ మిషన్‌లో భాగంగా 31 దేశాల నుంచి 60 శాస్త్రీయ అధ్యయనాలు చేస్తున్నారు. ఇందులో భారతదేశం, అమెరికా, యూరప్, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ విజయం ద్వారా భారతదేశం తన అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ మిషన్ అనేక సవాళ్లను అధిగమించి చివరకు ప్రారంభమైంది. ఫాల్కన్ 9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్, ISSలోని జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్‌లో లీక్ కారణంగా ఈ మిషన్ జూన్ 10, జూన్ 19, జూన్ 22 తేదీలలో ఆలస్యమైంది. నాసా, రోస్‌కాస్మోస్ సంయుక్తంగా ఈ సమస్యలను పరిష్కరించి, జూన్ 25న ఈ లాంచ్‌కు ఆమోదం తెలిపాయి.

ఇవీ చదవండి:

జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 01:22 PM