ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Batumi chess 2025: సెమీఫైనల్లో భారత్‌ చైనా

ABN, Publish Date - Jul 22 , 2025 | 05:43 AM

మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌లో ఇద్దరు భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌ సెమీస్‌ చేరి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2003 టోర్నీలో...

  • ఫైనల్‌-4కు దివ్య దేశ్‌ముఖ్‌

  • టైబ్రేక్‌లో హారికపై గెలుపు

  • మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌

బటూమి (జార్జియా): మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌లో ఇద్దరు భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌ సెమీస్‌ చేరి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2003 టోర్నీలో ద్రోణవల్లి హారిక క్వార్టర్స్‌ చేరడం అత్యుత్తమం కాగా.. ఇప్పుడు హంపి, దివ్య ఆ రికార్డును అధిగమించారు. హంపి ముందుగానే ఫైనల్‌-4 బెర్త్‌ను సొంతం చేసుకోగా.. సోమవారం జరిగిన టైబ్రేక్‌లో సహచర జీఎం హారికపై గెలిచిన దివ్య సెమీ్‌సకు దూసుకెళ్లింది. కాగా, క్వార్టర్‌ ఫైనల్స్‌లో దివ్య 3-1తో హారికపై నెగ్గింది. వీరిమధ్య తొలి రెండు గేమ్‌లు డ్రా కావడంతో 1-1తో సమంగా నిలిచారు. అయితే, టైబ్రేక్‌లో రెండు గేముల్లోనూ హారికకు దివ్య ఝలక్‌ ఇచ్చింది. మొత్తంగా ఇద్దరు భారత మాస్టర్లు, ఇద్దరు చైనా ప్లేయర్లు ఫైనల్‌-4కు చేరుకోవడం విశేషం. మంగళవారం జరిగే సెమీ్‌సలో జీఎం లీ టింగ్జీతో హంపి, జీఎం టాన్‌ జోంగ్‌యితో దివ్య తలపడనున్నారు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 05:43 AM