ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించి.. పూజించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Sep 05 , 2025 | 06:43 PM
ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. గతంలో పీసీసీ చీఫ్గా.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి హారతి ఇచ్చారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేశ్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్టించుకుని ఉత్సవాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు.
ఒక్కసారి నిర్వహణే కష్టమైన ప్రస్తుత రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
గతంలో పీసీసీ చీఫ్గా.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని చెప్పారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామన్నారు
ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఉత్సవ సమితి నిర్వహకులతోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడిని ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Sep 05 , 2025 | 06:44 PM