కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు
ABN, Publish Date - May 23 , 2025 | 12:27 PM
Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో వారు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ఈ పుష్కరాలకు వస్తున్నారు. మే 15వ తేదీన ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.
సరస్వతి పుష్కరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా కాళేశ్వరం తరలి వస్తున్నారు. సరస్వతి నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు
నదిలో పుణ్య స్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతి
నదిలో పుణ్యస్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతులు
నదిలో యువతికి చెంబుతో తలస్నానం చేయిస్తున్న మహిళ
నదిలో స్నానమాచరించి... సూర్యభగవానుడికి నమస్కరిస్తున్న యువతి.
నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహం
నదీ పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వరుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులు
Updated Date - May 23 , 2025 | 12:31 PM