ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bonalu Festival 2025: ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో రంగం వినిపించిన స్వర్ణలత

ABN, Publish Date - Jul 14 , 2025 | 07:47 PM

ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో (Ujjaini Mahakali Temple) ఈరోజు (సోమవారం) రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (Swarnalatha Bhavishya Vani) వినిపించారు.

1/14

ఆషాఢం మాసం కావడంతో.. తెలంగాణలో బోనాలు పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్‌లో కొలువు తీరిన ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో సోమవారం అంటే.. జులై 14వ తేదీ రంగం నిర్వహించారు.

2/14

ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి ఆమె భవిష్యవాణి చెప్పారు.

3/14

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. తాను కోపంగా లేనన్నారు.

4/14

తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారంటూ హెచ్చరించారు.

5/14

తన భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానన్నారు.

6/14

కానీ ప్రతీ ఏడాది ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు చెప్పారు.

7/14

ప్రతీ సంవత్సరం చెబుతున్నప్పటికీ తనను లెక్క చేయడం లేదన్నారు.

8/14

నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలని పేర్కొన్నారు.

9/14

నా కోపానికి మీరు బలి అవుతారు.. కానీ నేను కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుకుని చస్తారన్నారు.

10/14

దేవాలయం వద్ద అమ్మవారిని ఊరేగిస్తున్న దృశ్యం.

11/14

దేవాలయం బయట భక్తుల కిటకిట..

12/14

దేవాలయం వెలుపల.. ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు..

13/14

దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులు

14/14

సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ దేవాలయంలో కొలువు తీరిన మహాకాళి అమ్మవారు.

Updated Date - Jul 14 , 2025 | 07:55 PM