Adilabad: దేదీప్యమానంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Nov 05 , 2025 | 11:34 AM
ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి
పట్టణంలోని పురాతన శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో కార్తిక పౌర్ణమి శోభ
వందలాది సంఖ్యలో మహిళలు, యువతులు కాగడ హారతులు వెలిగించి పూజలు చేశారు.
ఆలయ ప్రాంగణంలో దీపాలను అందంగా అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది.
మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దీపాలంకరణలో పాల్గొన్నారు.
మహిళలు, యువతులు దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో వాటిని అందంగా అలంకరించారు.
దీపాల వెలుతురుతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది.
Updated Date - Nov 05 , 2025 | 11:36 AM