Indian Cricketers Houses: టీమిండియా క్రికెటర్ల టాప్ 9 విల్లాలు ఇవే..!
ABN, Publish Date - Nov 17 , 2025 | 05:26 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ల ఇళ్లకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భారత్ దిగ్గజ క్రికెటర్ల ఇళ్లు, వాటి ఖరీదు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రూ. 127 కోట్ల విలువైన ఇళ్లను కలిగి ఉన్నాడు. గురు గ్రామ్ లో రూ. 80 కోట్ల విలువైన ఇళ్లు ఉంది. ఓంకార్ 1973 టవర్స్లోని 35వ అంతస్తులో రూ. 34 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉంది. అలానే అలీబాగ్లోని ఆవాస్ గ్రామంలో రూ. 13 కోట్ల బంగ్లాను కూడా కలిగి ఉన్నారు.
మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలో కైలాశపతి అనే రూ. 100 కోట్ల విలువైన ఫామ్హౌస్ ఉంది. ఇది ఏడెకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో అతని కార్లు, బైక్ల కోసం ఒక గ్యారేజ్ ఉంది.
టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ రూ. 30 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉంది. ఇది దాదాపు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది అహుజా టవర్స్లోని 29వ అంతస్తులో ఉంది.
టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కోల్కతాలో రూ. 47 కోట్ల విలువైన బంగ్లా ఉంది.
భారత్ స్టార్ ఆల్ రౌండ్ హార్ధిక్ పాండ్యా వడోదరలో ఇటీవల ఒక కొత్త ఇంట్లోకి మారారు. దాని విలువ రూ. 3.6 కోట్లు ఉన్నట్లు సమచారం
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రూ.38 కోట్ల విలువైన బాంద్రా బంగ్లా ఉంది. ఈ భవనం అరేబియన్ సముద్రానికి ఎదురుగా ఉంటుంది
టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ముంబై లో రూ. 64 కోట్ల విలువైన ఇళ్లను కలిగి ఉన్నాడు. అతడికి గోవాలో కూడా ఓ ఇళ్లు ఉంది.
సునీల్ గవాస్కర్ గోవాలోని బెవర్లీ హిల్స్లో రూ. 20 కోట్ల విలువైన విల్లా ఉంది.
స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గుజరాత్ లోని జామ్నగర్ రూ.10 కోట్ల విలువైన ఇళ్లు ఉంది.
Updated Date - Nov 17 , 2025 | 06:03 PM