Home » Sports
భారత్, సౌతాఫ్రికా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకుండానే ముగిసింది. లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించి.. చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది. లక్నో నగరంలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నిన్న(మంగళవారం) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చేరారు. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్న నేపథ్యంలో, ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై జట్టు అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పెస్ట్ షేర్ చేశాడు.
ఇవాళ(బుధవారం)సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో రానున్నాడని సమాచారం.
ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వేలంలో భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా కోల్కతా జట్టు తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ అతడు డకౌట్ అయ్యాడు.
ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్.. 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ను రూ.25.20కోట్లకు కేకేఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా యాషెస్ సిరీస్లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్కు ఎలా ఆడతాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.