Home » Sports
కావ్యా మారన్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యజమానిగా అందరికి సుపరిచితమే. యజమానిగా తన జట్టును ప్రోత్సాహించడంలో కావ్య ఎప్పుడూ ముందుంటుంది. దాదాపుగా సన్రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతుంటుంది.
కోల్కతాతో తొలి మ్యాచ్లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో కమిన్స్ సేన తలపడనుంది...
ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.
ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 సీజన్తో క్రికెట్కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 2022 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. కోలుకునేందుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. తిరిగి ఫిట్ అయ్యేందుకు చాలా సమయం పట్టిందని, ఆ రోజులు తాను నరక యాతన అనుభవించానని రిషబ్ పంత్ చెబుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇబ్బందిగా అనిపించిందని వివరించాడు. తాను బతికి ఉన్నందుకు మాత్రమే సంతోషించానని వైరాగ్యంతో చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ అంటేనే క్రేజ్. స్టేడియంలో ఆటగాళ్ల ఫోర్ల మోత, సిక్సులతో చెలరేగిపోతారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై బౌలర్లు ఒత్తిడి పెంచుతారు. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగే మ్యాచ్ల కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముందంజ వేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో టాప్సీడ్ సాత్విక్ జంట 21–18, 2–14తో మహ్మద్ ఎహ్సాన్/హెండ్రా సెతివాన్ ద్వయాన్ని చిత్తుచేసి ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్ పంత్.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్లో ఆడేలా పంత్కు బీసీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్స్ దూసుకెళ్లి అదరగొట్టారు. మరోవైపు లక్ష్య సేన్ మాత్రం నిరాశ పరిచారు.