Home » Sports
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్లో జర్మనీ జట్టు చేతిలో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
టీమిండియా యంగ్ ప్లేయర్ రుతరాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. రాయ్ పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ శతకంతో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు.
రష్యన్ అథ్లెట్ సెర్గీ బోయ్ట్సోవ్ 5500 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ కింద ఏర్పాటు చేసిన మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో వీడియో 44 మిలియన్ వీక్షణలు దాటింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్కు దిగనుంది.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.
జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల సరసన స్థానం దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్గా హర్మన్ అరుదైన గౌరవం పొందనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులకు రోహిత్ శర్మ కేవలం 41 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాత ఈ అరుదైన క్లబ్లో స్థానం దక్కించుకునే నాలుగో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. హిట్మ్యాన్ రాయ్పూర్ వన్డేలో ఈ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రాంచీ వన్డేలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో విఫలమవడంతో రెండో వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ ఆడితే టీమిండియా మిడిల్ ఆర్డర్కు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.