Central Govt Scheme: సబ్సిడీతో రూ. 3 లక్షల రుణం.. పూర్తి వివరాలివే..
ABN, Publish Date - Sep 19 , 2025 | 05:28 PM
కార్మికులు, కుల వృత్తిదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.
దేశ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రజలు అనేక రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు.
ఇందులో భాగంగానే కార్మికులు, కుల వృత్తిదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.
ఈ పథకం కింద ప్రజలకు శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం, శిక్షణ అనంతరం బిజినెస్ కోసం సాయం కూడా చేస్తోంది.
18 సంప్రదాయ కుల వృత్తుల్లో నిమగ్నమైన వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ పథకం కింద లబ్ధిదారులకు కొన్ని రోజులు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కాలంలో రూ. 500 చొప్పున సాయం అందిస్తారు.
టూల్కిట్ కొనుగోలు చేయడానికి లబ్ధిదారులకు రూ. 15,000 కూడా ఇస్తారు.
అలాగే, లబ్ధిదారులకు శిక్షణ అనంతరం వ్యాపారం కోసం తక్కువ వడ్డీ రేటుకే రూ. 1 లక్ష రుణం కూడా ఇస్తారు.
ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే.. అదనంగా మరో రూ. 2 లక్షల రుణం ఇవ్వడం జరుగుతుంది.
ఈ రుణం ద్వారా లబ్ధిదారులు మంచి వ్యాపారం ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ (https://pmvishwakarma.gov.in/) ను చూడొచ్చు.
Updated Date - Sep 19 , 2025 | 05:28 PM